మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టుకు నేషనల్‌ బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-01-24T07:21:35+05:30 IST

కరోనా సమయంలో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నేషనల్‌ బెస్ట్‌ సర్వీసు అవార్డుకు ఎంపికయ్యారు.

మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టుకు   నేషనల్‌ బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు

గిద్దలూరు టౌన్‌, జనవరి 23 : పట్టణంలోని మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టుకు నేషనల్‌ బెస్ట్‌ సర్వీస్‌ అవార్డు లభించింది. ట్రస్టు చైర్మన్‌, వైసీపీ నాయకులు కామూరి రమణరెడ్డి మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టును స్థాపించి ప్రతి రోజు పేదలకు రూ.5కే భోజనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ట్రస్టు ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లో ఉచిత మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు. రూ.5 భోజనం అందించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నేషనల్‌ బెస్ట్‌ సర్వీసు అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డును పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-01-24T07:21:35+05:30 IST