సూపర్ ఓవర్లో బెంగళూరు విజయం
ABN , First Publish Date - 2020-09-29T05:20:49+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు సూపర్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు సూపర్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు..
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు సూపర్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఫించ్(35 బంతుల్లో 52 పరుగులు), పడిక్కల్(40 బంతుల్లో 54 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం డివిలియర్స్(24 బంతుల్లో 55 పరుగులు) వీర బాదుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. శివమ్ దూబే(10 బంతుల్లో 27 పరుగులు) కూడా 3 సిక్సులతో రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్లతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో కష్టాల్లో పడింది. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఇషాన్ కిషన్(58 బంతుల్లో 99 పరుగులు) భారీ ఇన్నింగ్స్కు పొలార్డ్(24 బంతుల్లో 60 పరుగులు) హిట్టింగ్ తోడవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
సూపర్ ఓవర్లో బెంగళూరు బౌలర్ నవదీప్ సైనీ అద్భుతమైన బౌలింగ్ తో ముంబై జట్టును కట్టడి చేశాడు. దీంతో ముంబై జట్టు సూపర్ ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరును డివిలియర్స్ రెండు ఫోర్లు కొట్టి గెలిపించాడు. ఈ విజయంతో బెంగళూర టోర్నీలో రెండో విజయం నమోదు చేసింది.