ఆ పిచ్ ‘బిలో యావరేజ్’ అట.. బెంగళూరు పిచ్పై ఐసీసీ పెదవి విరుపు
ABN , First Publish Date - 2022-03-21T00:33:12+05:30 IST
భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరులోని చిన్నస్వామి..
బెంగళూరు: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్పై ఐసీసీ పెదవి విరిచింది. మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ దీనిని ‘బిలో యావరేజ్’గా పేర్కొన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ పిచ్ అండ్ ఔట్ఫీల్డ్ మానిటరింగ్ విధానంలో భాగంగా ఈ పిచ్కు ఓ డిమెరిట్ పాయింట్ దక్కింది.
పిచ్ తొలి రోజు బాగా టర్న్ అయిందని, ఆ తర్వాత ప్రతి సెషన్లోనూ మెరుగుపడినప్పటికీ తన దృష్టిలో ఇది బ్యాట్, బాల్ మధ్య పోటీ కానేకాదని శ్రీనాథ్ చెప్పాడు. ఈ నివేదికను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు పంపినట్లు పేర్కొన్నాడు. ఈ టెస్టులో భారత జట్టు 238 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది.