బెంగళూరు, మైసూరులోనే Covid కేసులు

ABN , First Publish Date - 2022-03-17T16:22:47+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బెంగళూరు, మైసూరులోనే కొంత ప్రభావం చూపుతోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా

బెంగళూరు, మైసూరులోనే Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బెంగళూరు, మైసూరులోనే కొంత ప్రభావం చూపుతోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 97, మైసూరులో 17 మందికి ప్రబలింది. 14 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ఏడు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదు కాగా మరో ఏడు జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 392 మంది కోలుకోగా బెంగళూరులో ఇద్దరు మృతి చెందారు. 30 జిల్లాల్లో 2,092 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1,738 మంది ఉన్నారు. 15 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు ఉన్నారు. 

Updated Date - 2022-03-17T16:22:47+05:30 IST