Bengaluru: భర్త లైంగిక వాంఛ భార్య తీర్చలేదని...

ABN , First Publish Date - 2022-08-18T18:00:28+05:30 IST

లైంగిక వాంఛ తీర్చలేదనే కోపంతో తన భార్యను భర్త హతమార్చిన ఘటన...

Bengaluru: భర్త లైంగిక వాంఛ భార్య తీర్చలేదని...

బెంగళూరు (కర్ణాటక): లైంగిక వాంఛ తీర్చలేదనే కోపంతో తన భార్యను భర్త హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు(Bengaluru) నగరంలో సంచలనం రేపింది.తనతో శారీరక సంబంధానికి అంగీకరించలేదని భార్యను చంపి, తన భార్య కనిపించడం లేదని(files missing complaint) భర్త కట్టుకథ అల్లాడు.(cooked up a story and filed a complaint)సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బీహార్ రాష్ట్రానికి చెందిన పృథ్వీరాజ్ సింగ్(Pruthvi Raj Singh) అనే యువకుడు ఎలక్ట్రీషియన్‌గా బెంగళూరు నగరంలో పనిచేస్తున్నాడు. పృథ్వీరాజ్ సింగ్ 9 నెలల క్రితం జ్యోతికుమారిని (married Jyothi Kumari) వివాహం చేసుకున్నాడు.


పెళ్లి సమయంలో భార్య వయసు గురించి 28 ఏళ్లని అబద్ధం చెప్పడంతో ఆమెపై భర్త కోపం పెంచుకున్నాడు.38 ఏళ్ల వయసున్న జ్యోతికుమారి భర్తతో శారీరక సంబంధానికి అంగీకరించలేదు. దీంతోపాటు అత్తమామలను జంతువులని తిట్టింది.తనతో శారీరక సంబంధానికి అంగీకరించని భార్య జ్యోతికుమారిపై భర్త సింగ్ కోపంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.భార్యను చంపడానికి బీహార్(bihar) రాష్ట్రం నుంచి పృథ్వీరాజ్ సింగ్ తన స్నేహితుడైన సమీర్ కుమార్ ను బెంగళూరుకు పిలిచాడు. ఈ నెల 3వతేదీన సింగ్, సమీర్ లు కలిసి ఉడుపికి వెళ్లి, అక్కడ వారు జ్యోతిని గొంతు కోసి హత్య చేశారు. 


అనంతరం జ్యోతికుమారి మృతదేహాన్ని షిరాదీ ఘాట్ ప్రాంతంలో పడేశారు. మరుసటి రోజు తన భార్య జ్యోతికుమారి కనిపించడం లేదని పోలీసులకు భర్త పృథ్వీరాజ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. భార్య జ్యోతికుమారి పలుసార్లు పుట్టింటికి వెళ్లినా తిరిగి భర్త వద్దకు వచ్చేంది. ఈ సారి ఆమె ఫోన్ స్విచాఫ్ అవడంతో పోలీసులు అనుమానంతో దర్యాప్తు(investigation) చేయగా అసలు బాగోతం బయటపడింది. పోలీసులు కుళ్లిపోయిన జ్యోతి కుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం కోసం పంపించారు.పోలీసులు హంతకుడు పృథ్వీరాజ్ సింగ్ ను అరెస్టు(arrested) చేశారు.


Updated Date - 2022-08-18T18:00:28+05:30 IST