బెంగళూరులో తగ్గని Covid ఉధృతి

ABN , First Publish Date - 2022-01-02T17:44:27+05:30 IST

బెంగళూరులో కొవిడ్‌ కేసులు నాలుగింతలకు పైగా పెరిగాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,033 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 810 మంది ఉన్నారు. దక్షిణకన్నడలో 48, మైసూరులో 29, ఉడుపి 28,

బెంగళూరులో తగ్గని Covid ఉధృతి

బెంగళూరు: బెంగళూరులో కొవిడ్‌ కేసులు నాలుగింతలకు పైగా పెరిగాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,033 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 810 మంది ఉన్నారు. దక్షిణకన్నడలో 48, మైసూరులో 29, ఉడుపి 28, మండ్య 23మందికి వైరస్‌ ప్రబలగా 9 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 13 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. మరో మూడు జిల్లాల్లో 15లోపు కేసులు నమోదయ్యాయి. 354 మంది కోలుకోగా ఐదుగురు మృతిచెందారు. వీరిలో బెంగళూరులో ఇరువురు కాగా మరో మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఇంకా 9,386మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-01-02T17:44:27+05:30 IST