అతివేగంతో భవనంపైకి దూసుకెళ్లిన ఆడి కారు.. అంతలోనే

ABN , First Publish Date - 2021-09-01T02:46:07+05:30 IST

అతివేగంతో భవనంపైకి దూసుకెళ్లిన ఆడి కారు.. అంతలోనే

అతివేగంతో భవనంపైకి దూసుకెళ్లిన ఆడి కారు.. అంతలోనే

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా ప్రయాణిస్తూ ఆడి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మృతి చెందిన వారు 20 సంవత్సరాల లోపే ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జరిగింది. ఆడి క్యూ 3 కారు ఫుట్‌పాత్ మీదుగా వెళ్లి భవనంపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తమిళనాడు ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు మరణించారు. డ్రైవర్ వేగంగా వెళ్తున్న కారుపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-09-01T02:46:07+05:30 IST