బెంగళూరులో 1008 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-06-24T16:48:46+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌కేసుల సంఖ్య నిలకడగా ఉంది. రాష్ట్ర వ్యా ప్తంగా 4,436 మందికి పాజిటివ్‌ రాగా బెంగళూరులో 1008 మందికి సోకింది. దక్షిణ కన్నడలో 538, మైసూరు 499 మంది కా

బెంగళూరులో 1008 మందికి కరోనా పాజిటివ్‌


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌కేసుల సంఖ్య నిలకడగా ఉంది. రాష్ట్ర వ్యా ప్తంగా 4,436 మందికి పాజిటివ్‌ రాగా బెంగళూరులో 1008 మందికి సోకింది. దక్షిణ కన్నడలో 538, మైసూరు 499 మంది కాగా మిగిలిన జిల్లాల్లో 250లోపుగా నమోదయ్యారు. బీదర్‌లో ఒకరు, విజయపురలో ఏడుగురు, యాదగిరి బాగల్కోటెలలో తొమ్మిది మంది చొప్పున నమోదయ్యారు. 6,455 మంది కోలుకోగా 123 మంది మృతి చెందారు. వీరిలో బెంగళూరులో 24, మైసూరులో 18, దక్షిణకన్నడ 13, బళ్ళారిలో 10 మంది కాగా మిగిలిన జిల్లాల్లో పదిమందిలోపు నమోదు కాగా పది జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. 1,16,450 మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో బెంగళూరులోనే 69,257 మంది ఉన్నారు. 

Updated Date - 2021-06-24T16:48:46+05:30 IST