bengaluruలో ఏడాది తర్వాత అతి తక్కువ covid కేసులు

ABN , First Publish Date - 2021-10-19T17:17:19+05:30 IST

కొవిడ్‌ రెండోవిడతలో రోజూ వేలాది కేసులు నమోదైన బెంగళూరులో తొలిసారి వందలోపు కేసులు వచ్చాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 214 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 83 మందికి వైరస్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో ఒక్కకేసు కూ

bengaluruలో ఏడాది తర్వాత అతి తక్కువ covid కేసులు

బెంగళూరు: కొవిడ్‌ రెండోవిడతలో రోజూ వేలాది కేసులు నమోదైన బెంగళూరులో తొలిసారి వందలోపు కేసులు వచ్చాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 214 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 83 మందికి వైరస్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మైసూరులో 27, దక్షిణ కన్నడలో 22మంది కాగా తుమకూరులో 14, శివమొగ్గ, హాసన్‌లలో 13మంది చొప్పున నమోదయ్యారు. 488మంది కోలుకోగా 12మంది మృతి చెందారు. 22 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. 30 జిల్లాల్లో ఇంకా 9,164 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-10-19T17:17:19+05:30 IST