సుబేందు అధికారికి కౌంటర్ ఇచ్చిన ఒమర్

ABN , First Publish Date - 2021-03-07T18:43:59+05:30 IST

తృణమూల్ తిరిగి గెలిస్తే బెంగాల్‌ను కశ్మీర్‌లా మార్చేస్తారని బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా

సుబేందు అధికారికి కౌంటర్ ఇచ్చిన ఒమర్

కోల్‌కతా : తృణమూల్ తిరిగి గెలిస్తే బెంగాల్‌ను కశ్మీర్‌లా మార్చేస్తారని బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముచిపారా, బెహేలా ప్రాంతాల్లో పర్యటించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గనక లేకపోతే దేశం ఇస్లామిక్ దేశంగా మారిపోయి ఉండేదని, బంగ్లాదేశ్‌లో నివసించాల్సి వచ్చేదని అన్నారు. తృణమూల్ గనక అధికారంలోకి వస్తే కశ్మీర్‌లా మారిపోతుందని హెచ్చరించారు. 

కౌంటర్ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా

సుబేందు అధికారి వ్యాఖ్యలకు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. ‘‘బీజేపీ ప్రకారం ఆగస్ట్ 2019 తర్వాత కశ్మీర్ స్వర్గంలా మారిపోయింది కదా. బెంగాల్ కశ్మీర్‌లా మారితే ఏమవుతుంది? కశ్మీర్‌ను ఇష్టపడే బెంగాలీలు చాలా మందే ఉన్నారు. అదో పనికి మాలిన కామెంట్. ’’ అంటూ ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. 

Updated Date - 2021-03-07T18:43:59+05:30 IST