లాక్‌డౌన్‌లో పాలప్యాకెట్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి...

ABN , First Publish Date - 2020-03-26T17:41:06+05:30 IST

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ సందర్భంగా పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అతను మరణించిన విషాద ఘటన....

లాక్‌డౌన్‌లో పాలప్యాకెట్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి...

పోలీసు దెబ్బలకు ఒకరి మృతి

కోల్‌కతా : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ సందర్భంగా పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అతను మరణించిన విషాద ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా నగరంలో వెలుగుచూసింది. హౌరా నగరానికి చెందిన లాల్ స్వామి అనే 32 ఏళ్ల వ్యక్తి లాక్ డౌన్ సందర్భంగా పాల ప్యాకెట్ కొనేందుకు వీధుల్లోకి వచ్చారు. వీధుల్లో పహరా కాస్తున్న పోలీసులు లాల్ స్వామిని లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన లాల్ స్వామిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారు. పోలీసుల లాఠీ దెబ్బల వల్లనే లాల్ స్వామి మరణించాడని మృతుడి కుటుంబీకులు చెపుతుండగా, పోలీసులు మాత్రం గుండెపోటుతోనే మరణించాడని అంటున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 10కి చేరగా, ఒకరు మరణించారు. 

Updated Date - 2020-03-26T17:41:06+05:30 IST