లతాజీ గౌరవార్ధం హాఫ్ డే సెలవు ప్రకటించిన మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2022-02-06T22:23:14+05:30 IST

దివంగత లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ గౌరవార్ధం సోమవారంనాడు హాఫ్-డే సెలవుదినాన్ని..

లతాజీ గౌరవార్ధం హాఫ్ డే సెలవు ప్రకటించిన మమతా బెనర్జీ

కోల్‌కతా: దివంగత లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ గౌరవార్ధం సోమవారంనాడు హాఫ్-డే సెలవుదినాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లతామంగేష్కర్ అభిమానుల్లో తాను కూడా ఒకరినని, ఆమె గానం తనను సమ్మెహనపరచేదని సీఎం గుర్తు చేసుకున్నారు. భారతరత్న లతా మంగష్కర్ కోట్లాది మంది అభిమానులను దుఃఖంలో ముంచెత్తి, తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత గాయనికి నివాళులర్పించారు. నిజమైన నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఆమె స్మృతులు చిరస్మరణీయమని అన్నారు. లతా మంగేష్కర్ ముంబై ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 8.12 గంటలకు అంతిమశ్వాస విడిచారు.  కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వ లాంఛనాలతో ముంబైలోని శివాజీ పార్క్‌లో లతాజీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-02-06T22:23:14+05:30 IST