కొత్త పారిశ్రామిక విధానంతో వ్యాపారులకు మేలు

ABN , First Publish Date - 2020-08-12T10:33:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధా నం అమలు చేయడం ఆనంద దా యకమని, దీనివల్ల వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ..

కొత్త పారిశ్రామిక విధానంతో వ్యాపారులకు మేలు

ఇంగిలిగాం పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం ప్రతినిధులు


పలాస, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధా నం అమలు చేయడం ఆనంద దా యకమని, దీనివల్ల వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ఇంగిలిగాం పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, ప్రధాన కార్య దర్శి తూముల శ్రీనివాసరావు, కోశా ధికారి శాసనపురి శ్రీనివాసరావు అ న్నారు.  మంగళవారం వారు విలేక రులతో మాట్లాడుతూ.. కొత్త పారిశ్రామిక విధానంతో మహిళలు, యువతకు ఎం తో ప్రయోజనం చేకూరుతుందన్నారు.


ఈ విధానం ప్రకటించడంపై మంత్రి డాక్ట ర్‌ సీదిరి అప్పలరాజుతో పాటు పరిశ్రమలశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ ఇదిలా ఉండగా.. కొత్త పాలసీ విధానం వల్ల సూక్ష్మ, మధ్య తరగతి పరి శ్రమలకు విద్యుత్‌ వినియోగానికి ప్రోత్సాహకం ఇవ్వడం శుభపరిణామమని  పీసీ ఎంఏ మాజీ కార్యదర్శి మల్లా సురేష్‌కుమార్‌, తర్లాన రమేష్‌ ఒక  ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 శాతం రాయితీ ఇవ్వడం వల్ల అనేక మంది పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-12T10:33:02+05:30 IST