తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని.. పాము కాటేయడంతో..

ABN , First Publish Date - 2020-08-07T12:24:33+05:30 IST

తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న బాలుడిని..

తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని.. పాము కాటేయడంతో..

కొలిమిగుండ్ల(కర్నూలు): తల్లితో కలిసి మంచంపై నిద్రిస్తున్న బాలుడిని పాము కాటేసింది. ఆసుపత్రికి తరలించేలోగానే పసి వాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన బెలుం శింగవరం దళిత కాలనీలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్య, సుబ్బమ్మ దంపతుల ఏకైక కుమారుడు హేమచంద్ర (5) మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లి సుబ్బమ్మతో కలిసి మంచంపై నిద్రిస్తుం డగా పాము పైకెక్కి మరీ కాటు వేసింది. బాలుడు గట్టిగా అరవడంతో తల్లి లేచి చూసింది. నాగుపాము పాకుతూ బీరువా చాటుకు వెళ్లిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపేశారు. పాము ఐదున్నర అడుగుల పొడవు ఉంది. చికిత్స నిమిత్తం హేమచంద్రను తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో తల్లిదం డ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Updated Date - 2020-08-07T12:24:33+05:30 IST