బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు
ABN , First Publish Date - 2020-08-09T07:20:49+05:30 IST
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్...
బెల్లంపల్లి, ఆగస్టు 8: బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా గడ్డం కళ్యాణి భీమా గౌడ్, వైస్చైర్మన్గా మోటప లుకుల రాజశేఖర్, డైరెక్టర్లుగా సరళ శ్యాంసుందర్సారాడ, కొడిపాక రంజిత్, బోనగిరి లావణ్య, రాంటెంకి వాసుదేవ్, భాస్కర్గౌడ్, లక్ష్మీనారాయణ, ఏనుగు మాధవి, తలండి అశోక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
మండలం నుంచి ఇద్దరికి చోటు
కాసిపేట: బెల్లంపల్లి మార్కెట్ కమిటీలో మండలానికి చెం దిన ఇద్దరికి స్థానం లభించింది. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్ని కల్లో చురుగ్గా పాల్గొన్న ధర్మారావుపేట మాజీ ఎంపీటీసీ ఏను గు మంజులారెడ్డి, కోమటిచేనుకు చెందిన రాంటెంకి వాసుదే వ్లకు డైరెక్టర్ పదవులు వరించాయి.