టీటీడీ ఆధ్వర్యంలో 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తాం: ఈవో సింఘాల్

ABN , First Publish Date - 2020-03-28T19:21:35+05:30 IST

తిరుమల: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ శ్రేయ్యస్సును కాంక్షించి..

టీటీడీ ఆధ్వర్యంలో 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తాం: ఈవో సింఘాల్

తిరుమల: కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ శ్రేయ్యస్సును కాంక్షించి మూడు రోజుల పాటు ధన్వంతరి యాగాన్ని ఘనంగా నిర్వహించామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. స్వామి వారి దర్శనానికి భక్తులపై ఆంక్షలు ఉన్నాయన్నారు.


శ్రీవారికి నిత్య కైంకర్యాలను యథావిధిగా నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. నేటి నుంచి టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అనాథలకు నిత్యం 50 వేల ఆహార ప్యాకెట్లను పంపిణి  చేస్తామని ఈవో వెల్లడించారు. బర్డ్ ఆస్పత్రిని కూడా క్వారంటైన్‌గా వినియోగిస్తామన్నారు. వెంటిలేటర్ల కొరత లేకుండా టీటీడీ తరుపున వెంటిలేటర్లను కొనుగోలు చేస్తామని ఈవో సింఘాల్ తెలిపారు.


Updated Date - 2020-03-28T19:21:35+05:30 IST