సింధు శుభారంభం

ABN , First Publish Date - 2022-01-20T06:42:03+05:30 IST

ఫేవరెట్‌ పీవీ సింధు సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో

సింధు శుభారంభం

లఖ్‌నవూ: ఫేవరెట్‌ పీవీ సింధు సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో టాప్‌సీడ్‌ సింధు 21-9, 21-9తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌పై గెలిచింది. రెండోరౌండ్లో లారెన్‌ లామ్‌ (అమెరికా)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ సోదరుడు చిరాగ్‌ సేన్‌ 21-9, 21-6తో అన్సల్‌ యాదవ్‌పై, కౌశల్‌ 14-21, 21-11, 21-16తో జియా హెంగ్‌ జాసన్‌పై గెలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో ఏడోసీడ్‌ పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ 21-1, 21-4తో మహెక్‌ నాయక్‌-సౌమ్యా సింగ్‌ జంటను ఓడించింది. 

Updated Date - 2022-01-20T06:42:03+05:30 IST