యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భిక్షాటన
ABN , First Publish Date - 2021-09-18T03:56:00+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబరు 17న నిరుద్యోగ దినోత్సవంగా జరపాలని మండల కేం ద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు భిక్షాటన చేశారు. మంద రాజేష్, హేమంత్చారీలు మాట్లాడుతూ మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, బీజేపీ అధికారంలోకి వస్తే యేటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు.
జన్నారం, సెప్టెంబరు 17: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబరు 17న నిరుద్యోగ దినోత్సవంగా జరపాలని మండల కేం ద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు భిక్షాటన చేశారు. మంద రాజేష్, హేమంత్చారీలు మాట్లాడుతూ మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, బీజేపీ అధికారంలోకి వస్తే యేటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. అబ్దుల్ముజ్జు, అజహర్, రాకేష్గౌడ్, సన్ని, రాజేందర్, సాయి, పటేల్, దిలీప్, శివ, మహేష్ పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచారని చెన్నూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సట్ల సంతోష్గౌడ్ మండిపడ్డారు. బస్టాండ్ ఏరియాలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పండ్లు, చాయ్లు అమ్మి నిర సన తెలిపారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుంద న్నారు. రాజేందర్గౌడ్, రాము, రాజేష్, ప్రవీణ్, వెంకటేష్ పాల్గొన్నారు.