కరోనా నిరోధక నిధి కోసం భిక్షగాడి దాతృత్వం..

ABN , First Publish Date - 2020-08-12T15:21:50+05:30 IST

కరోనా నిరోధక నిధి కోసం భిక్షగాడి దాతృత్వం..

కరోనా నిరోధక నిధి కోసం భిక్షగాడి దాతృత్వం..

కరోనా నిరోధక నిధికి ఎనిమిదోసారి రూ.10వేలు అందజేత

చెన్నై: తమిళనాడులో కరోనా నిరోధక నిధికి వరుసగా ఎనిమిదో సారి తనవంతు విరాళం ఇచ్చి ఓ భిక్షగాడు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఇప్పటివరకు ఆయన రూ.80 వేలను కరోనా నిరోధక నిధికి అందజేశాడు. తూత్తుకుడి జిల్లా ఆలంగుడికి చెందిన పూల్‌పాండియన్‌ (65) వివాహమైన కొద్దిరోజుల్లోనే కుటుంబాన్ని వదిలేసి ముంబైకి వెళ్లాడు. అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో భిక్షాటన చేసి జీవించేవాడు. ముంబై నుంచి ఆయన ఇంటికి రాగా, కుటుంబసభ్యులు ఇంట్లోకి రానీయలేదు. అనంతరం భిక్షాటన చేస్తూ పొట్ట పోసుకుంటున్న ఆయన తన ఖర్చులకు పోగా మిగిలిన నగదుతో కుర్చీలు, బెంచీలు సహా పలు పరికరాలకు కొనుగోలు చేసి పాఠశాలలకు అందిస్తుంటాడు. ఆయన గత మే నుంచి భిక్షాటన చేసి వచ్చిన తలా రూ.10 వేల చొప్పున ఏడుసార్లు కరోనా నివారణ నిధికి అంద జేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఎనిమిదోసారి మరో రూ.10 వేలను కలెక్టర్‌ వినయ్‌కు అందజేశాడు. ఆయన దాతృత్వాన్ని మెచ్చిన పలువురు అభినందించారు.  

Updated Date - 2020-08-12T15:21:50+05:30 IST