తేనెటీగల దాడిలో కూలీ మృతి

ABN , First Publish Date - 2022-05-20T07:09:41+05:30 IST

తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి చెందాడు.

తేనెటీగల దాడిలో కూలీ మృతి
నాగయ్య (ఫైల్‌ ఫొటో)

సత్యవేడు. మే 19 : తేనెటీగల దాడిలో ఉపాధి కూలీ మృతి చెందాడు.రెండు రోజుల క్రితం సత్యవేడు మండలం పెద్దఈటిపాకం పంచాయతీ రాచపాళెం దళితవాడలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలువ పూడికతీత పనులు నిర్వహిస్తుండగా తేనెటీగలు కొందరు కూలీలపై దాడి చేశాయి.ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎస్‌.నాగయ్య (50)కు కుటుంబసభ్యులు సత్యవేడులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి నాగయ్య మృతి చెందినట్లు ఉపాధి హామీ ఏపీవో భాస్కరయ్య తెలిపారు. యజమానిని కోల్పోయిన నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-20T07:09:41+05:30 IST