కరోనాతో మెంటల్ టెన్షన్.. విరుగుడుగా కొత్త పథకాన్ని ప్రకటించిన Nirmala Sitharaman

ABN , First Publish Date - 2022-02-01T17:35:27+05:30 IST

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది

కరోనాతో మెంటల్ టెన్షన్.. విరుగుడుగా కొత్త పథకాన్ని ప్రకటించిన Nirmala Sitharaman

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వల్ల ఎంతో మంది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైరస్‌కు భయపడి ఇళ్లలోనే గడుపుతూ భయాందోళనలకు గురయ్యారు. అన్ని వయసుల వారు ఈ మహమ్మారి వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. 


మానసిక అనారోగ్యానికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. `జాతీయ టెలీ మెంటల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్`ను ప్రారంభించనుంది. ఈ పథకంలో భాగంగా మానసిక ఆరోగ్యం కోసం కౌన్సిలింగ్, చికిత్స అందిస్తారు. 

Updated Date - 2022-02-01T17:35:27+05:30 IST