రక్తదానంతో ప్రాణదాతలు అవ్వండి
ABN , First Publish Date - 2021-01-25T04:18:55+05:30 IST
రక్తదానతంతో ప్రాణదాతలు కావాలని ప్రభుత్వ రక్తనిధి కేంద్రం వైద్యులు డాక్టర్ సత్యశ్రీనివాస్ అన్నారు. గణతంత్ర దినోత్సావాన్ని పురష్కరించుకుని మాజీ సైనికులు ఆధ్వర్యంలో ఆదివారం అలకనందకాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
రింగురోడ్డు : రక్తదానతంతో ప్రాణదాతలు కావాలని ప్రభుత్వ రక్తనిధి కేంద్రం వైద్యులు డాక్టర్ సత్యశ్రీనివాస్ అన్నారు. గణతంత్ర దినోత్సావాన్ని పురష్కరించుకుని మాజీ సైనికులు ఆధ్వర్యంలో ఆదివారం అలకనందకాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సత్యశ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కాగా 158వ సారి బొడ్డేపల్లి రామకృష్ణరావు రక్తదానం చేయడంపై సర్వాత్రా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జీఎంఆర్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, మాజీ సైనికులు విజయ్కుమార్, కింతాడ రాము, రామారావు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.