అప్రమత్తంగా ఉండాలి: సీసీఎస్ డీసీపీ గజరావ్ భూపాల్
ABN , First Publish Date - 2022-06-27T22:23:04+05:30 IST
Hyderabad: ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ గజారావ్ భూపాల్ కోరారు.
Hyderabad: ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ గజారావ్ భూపాల్ కోరారు. ‘‘డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను డిస్ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టి మోసం చేస్తున్నారు. దీంతో కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్నాం. డీజీపీ డీపీతో వాట్సాప్ ద్వారా అందరికి మెసేజ్ చేసి, డబ్బులు అడుగుతున్నారు. గతంలో I &PR ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేరుతో కూడా డబ్బులు వసూలు చేశారు. ఇలా చాలా మంది ఐఏఎస్, IPS ఆఫీసర్ల పేరుతో మోసం చేస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.