సీజన ల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-03-03T04:45:40+05:30 IST
ప్రస్తుత వాతావరణంలో మార్పులు చేసుకుంటున్న నేపద్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్వో జ్యోత్స్న అన్నారు.
రామాపురం, మార్చి 2 : ప్రస్తుత వాతావరణంలో మార్పులు చేసుకుంటున్న నేపద్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్వో జ్యోత్స్న అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లకు ముందస్తు చర్యలపై మంగళవారం సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దోమ లు వ్యాప్తి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రై డే ను పాటించాలన్నారు. కుటుంబ నియంత్రణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యాధికారి విజయ్కుమార్ మాట్లాడు తూ దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి, బీపీ, ఘుగర్, గుండె జబ్బులు, కిడ్నీ వంటి వ్యాదులు ఉన్న 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్న స్ర్తీ, పురుషులకు కోవిడ్-19 వ్యాక్సిన్ను ఇస్తామన్నారు. అదే విధంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ను ఇస్తామని తెలిపారు. కార్యక్రమం లో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.