అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-17T05:04:00+05:30 IST

అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వేకోడూరు అగ్ని మాపక కేంద్రం అధికారి నెల్లారి సుబ్బరాజు తెలిపారు.

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గ్యాస్‌ వల్ల వచ్చే ప్రమాదాల గురించి వివరిస్తున్న అగ్నిమాపక అధికారి సుబ్బరాజు

రైల్వేకోడూరు రూరల్‌, ఏప్రిల్‌ 16: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వేకోడూరు అగ్ని మాపక కేంద్రం అధికారి నెల్లారి సుబ్బరాజు తెలిపారు. శుక్రవారం మండలం లోని మైసూరివారిపల్లెలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల లో ఉన్న గ్యాస్‌ సిలిండర్ల వద్ద గాలి, వెలుతురు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-04-17T05:04:00+05:30 IST