సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-25T06:17:29+05:30 IST

మండలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ


 ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ 

హుకుంపేట, మే 24: మండలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్‌ వ్యాధులపై అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా వ్యాధుల కారక దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా నీరు, మురుగు నిల్వలను అరికట్టాలన్నారు. అలాగే పల్లెల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధకనబరచాలని, గ్రామాల్లో రోగాల వ్యాప్తికి అవకాశం లేకుండా పారామెడికల్‌ సిబ్బంది ముందజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పారామెడికల్‌ సిబ్బంది పనితీరును మండల అధికారులు పర్యవేక్షించాలని, నిర్లక్ష్యంగా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని పీవో హెచ్చరించారు. పర్యవేక్షణకు సంబంధించి డైలీ రిపోర్టు తమకు సమర్పించాలన్నారు. మండలంలో ఇప్పటికే పలుచోట్ల రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పర్యవేక్షణ లోపిస్తే నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. అలాగే ఇంకా రోడ్లు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, వాటిని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌, ఎంపీపీ కూడ రాజబాబు, జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, సీనియర్‌ డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, ఎంపీడీవో సుధాచాయ,ఎంఈవో ఎస్‌.రామచంద్రరావు, ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజని, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ రమేశ్‌, స్థానిక సర్పంచ్‌ ఎస్‌.పూర్ణిమ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T06:17:29+05:30 IST