తెలుగు రాష్ట్రాల్లో ‘బి ద ఛేంజ్ ఫౌండేషన్’ సేవలు

ABN , First Publish Date - 2020-05-25T18:59:51+05:30 IST

కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఒకపక్క వైరస్ భయం.. మరోపక్క కూలీ లేక పస్తులుండటం..

తెలుగు రాష్ట్రాల్లో ‘బి ద ఛేంజ్ ఫౌండేషన్’ సేవలు

ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఒకపక్క వైరస్ భయం.. మరోపక్క కూలీ లేక పస్తులుండటం.. ఇంకోపక్క పుట్టిన ఊరిపై బెంగ.. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల దయనీయ పరిస్థితి ఇది. ఈ పరిస్థితుల్లో పిల్లాజెల్లలతో కలిసి సొంతూళ్లకు పయనమైన విషయం తెలిసిందే. గత నెలరోజులుగా ఏ రోడ్డు చూసినా వలస కూలీలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. కాలినడకన వారు సాగిస్తున్న ప్రయాణం ఎందరినో కదిలించింది. అలా జాతీయ రహదారులపై కాలినడకన వెళ్లే వలస కార్మికులకు ‘బి ద చేంజ్ ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఈ ఫౌండేషన్ ప్రకాశం జిల్లా కేంద్రంగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అనేక వెతలకు గురైన వలస కార్మికుల ఆకలి దప్పులు తీర్చాలన్న దృఢ సంకల్పంతో నెల రోజుల పాటు సేవాకార్యక్రమాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ వర్గాల వారి సహాయంతో ఏప్రిల్ రెండో వారం నుంచి సేవలందిస్తున్నామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ‘వారి కళ్ళలోకి చూస్తే.. మన కళ్ళలో నీరు రాకుండా ఆగదు. అంత దయనీయ స్థితిని జీవితంలో చూడలేదు’ అంటూ ఉద్వేగానికి గురవుతున్నారు.  


తెలుగు రాష్ట్రాలలోని వలస కార్మికులకు ‘బి ద ఛేంజ్ ఫౌండేషన్’ సేవలు

Updated Date - 2020-05-25T18:59:51+05:30 IST