bda కాంప్లెక్స్‌ వేలం ప్రక్రియ తక్షణం ఆపాలి

ABN , First Publish Date - 2021-10-15T13:51:09+05:30 IST

బెంగళూరు ఇందిరానగర్‌లోని బీడీఏ కాంప్లెక్స్‌ను అప్పనంగా ఎంబస్సి అనే ప్రైవేటు సం స్థకు అప్పగిచేందుకు కుట్ర జరుగుతోందని బహుజన అంబేడ్కర్‌ సమాజ రాష్ట్ర అధ్యక్షుడు హలసూరు రంగణ్ణ ఆరోపించారు. దీనిని నిరసనగా

bda కాంప్లెక్స్‌ వేలం ప్రక్రియ తక్షణం ఆపాలి

బెంగళూరు: బెంగళూరు ఇందిరానగర్‌లోని బీడీఏ కాంప్లెక్స్‌ను అప్పనంగా ఎంబస్సి అనే ప్రైవేటు సం స్థకు అప్పగిచేందుకు కుట్ర జరుగుతోందని బహుజన అంబేడ్కర్‌ సమాజ రాష్ట్ర అధ్యక్షుడు హలసూరు రంగణ్ణ ఆరోపించారు. దీనిని నిరసనగా నగరంలోని మౌర్య సర్కిల్‌ వద్ద సమాజ పదాదికారులు నేతలు బుధవారం ధర్నా చేశారు. బీడీఏ అధికారుల అవినీతిని ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. ప్రభుత్వ నిర్వహణలోని 6.23 ఎకరాలలోని ఈ కాంప్లెక్స్‌ను కూల్చివేసి మల్టీప్లెక్స్‌ కాంప్లెక్స్‌గా చేసే ప్రయత్నాల వెనుక భారీకుట్ర ఉందని ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-15T13:51:09+05:30 IST