బీసీలను అణిచేస్తున్నారు: శేషు

ABN , First Publish Date - 2022-06-21T22:32:24+05:30 IST

Elurur: వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు ఆరోపించారు. జంగారెడ్డిగూడెం టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు పాకనాటి అంజిబాబు ఆధ్వర్యంలో

బీసీలను అణిచేస్తున్నారు: శేషు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా) : వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు ఆరోపించారు. జంగారెడ్డిగూడెం టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు పాకనాటి అంజిబాబు ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాక ఆయన  మాట్లాడుతూ ప్రజలు చీదరించుకుంటున్న జగన్ పతకం ఎంతో దూరం లేదన్నారు. జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చడాన్ని ఖండించారు. బీసీ నాయకుడు, రాజన సత్యనారాయణ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కాలేజీకి 22 ఎకరాలు ఉచితంగా ఇచ్చిన కుటుంబం 2 సెంట్లు భూమి ఆక్రమిస్తుందా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరావు మాట్లాడుతూ బీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, రాష్ట్ర మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్ పాల్, కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, మందపల్లి లక్ష్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు,అల్లూరి రామకృష్ణ, మద్దిపాటి నాగేశ్వరావు, చెరుకూరి శ్రీధర్, నంగులూరి జగత్, గుమ్మడి ప్రసాద్, పట్టణ అధికార ప్రతినిధి గెడా సుబ్రహ్మణ్యం, షేక్ యాకుబ్, షేక్ నజీర్, దుర్గేష్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బూసా సత్యనారాయణ రెడ్డి, ఐ టీడీపీ అధ్యక్షులు సాయికృష్ణ, శీలామంతుల రాంబాబు, ఎంపీటీసీ రాంబాబు, కొంచాడ రాజు, చిలంకూరి బాబీ, ఊదర సుబ్బారావు, రంగా, యడ్లపల్లి ఏడుకొండలు, మడ్డి రామారావు, ఆటో ఎన్.టి.ఆర్, పాకనాటి సురేష్, పాకనాటి కాశి, కాగితాల రాంబాబు, వెంకట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  




Updated Date - 2022-06-21T22:32:24+05:30 IST