ఇది ఫైనల్‌కాదు

ABN , First Publish Date - 2020-05-29T09:12:02+05:30 IST

సీఏ ప్రకటించిన భారత జట్టు పర్యటన షెడ్యూల్‌ ఫైనల్‌ కాదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌ ధూమల్‌ చెప్పారు...

ఇది ఫైనల్‌కాదు

బీసీసీఐ

న్యూఢిల్లీ: సీఏ ప్రకటించిన భారత జట్టు పర్యటన షెడ్యూల్‌ ఫైనల్‌ కాదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌ ధూమల్‌ చెప్పారు. ‘ఈరోజు క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన షెడ్యూల్‌.. ఎనిమిదేళ్ల భవిష్య పర్యటనల కార్యక్రమంలో భాగంగా గతంలో ఖరారు చేసినదే. ఐసీసీ కనుక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను రద్దు చేస్తే.. అక్టోబరులో భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లడం, మళ్లీ వెనక్కు రావడం, తిరిగి అక్కడకు పయనం కావడంవల్ల ఉపయోగమేమిటి’ అని ప్రశ్నించారు. అంతేకాదు..పరిస్థితులను బట్టి పర్యటనలో మార్పులు చేయాల్సి ఉంటుందని ముక్తాయించారు. 

Updated Date - 2020-05-29T09:12:02+05:30 IST