BCCI: మళ్లీ మారిన భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్

ABN , First Publish Date - 2021-07-10T23:34:19+05:30 IST

భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరోమార్పు చోటుచేసుకుంది.

BCCI: మళ్లీ మారిన భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్

న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో మరోమార్పు చోటుచేసుకుంది. శ్రీలంక క్రికెట్ బృందంలో ఇద్దరికి కరోనా సోకడంతో అప్రమత్తమైన ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రధాన జట్టు ఆటగాళ్లందరినీ క్వారంటైన్‌ తరలించింది. ఆటగాళ్లందరూ క్వారంటైన్‌కు వెళ్లడంతో ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన సిరీస్‌ను నాలుగు రోజులు వెనక్కి జరిపి 17 నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించారు.  


తాజాగా, ఈ షెడ్యూల్‌లోనూ బీసీసీఐ మార్పులు చేసింది. నిన్న ప్రకటించిన తేదీకి మరో రోజు వెనక్కి జరిపి 18 నుంచి సిరీస్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. తాజా షెడ్యూల్ ప్రకారం 18న తొలి వన్డే జరగనుండగా, 20, 23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయని పేర్కొన్నారు. 25 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. 

Updated Date - 2021-07-10T23:34:19+05:30 IST