బయో బబుల్ ఎలా బ్రేక్ అయిందో తెలియడం లేదు: గంగూలీ

ABN , First Publish Date - 2021-05-06T21:17:53+05:30 IST

ఐపీఎల్ బయోబబుల్ ఎందుకు బలహీనంగా మారిందో అర్థం కావడం లేదని, బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

బయో బబుల్ ఎలా బ్రేక్ అయిందో తెలియడం లేదు: గంగూలీ

ఐపీఎల్ బయోబబుల్ ఎందుకు బలహీనంగా మారిందో అర్థం కావడం లేదని, బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ అర్ధంతరంగా ముగిసిన నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు. ఐపీఎల్ నిర్వహించాలనుకున్నప్పుడు పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నాడు. 


`బయో బబుల్ ఇలా బలహీనంగా ఎందుకు మారిందో తెలియడం లేదు. బహుశా ప్రయాణాలు ఒక కారణం కావొచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐపీఎల్ నిర్వహించాలని మేం అనుకున్నప్పుడు కోవిడ్ విజృంభణ ఈ స్థాయిలో లేదు. ఇప్పుడు ఎవరు ఎన్నైనా చెబుతారు. కానీ, మేం మొదలుపెట్టినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేద`ని గంగూలీ అన్నాడు. ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ను దుబాయ్‌లో నిర్వహించబోతున్నారనే వార్తల గురించి స్పందిస్తూ.. `దాని గురించి ఇప్పుడే మాట్లాడడం కష్టం. ఇంకా చాలా సమయం ఉంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మాత్రం ఇంగ్లండ్‌లో అనుకున్న విధంగానే జరుగుతుంది. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండి మ్యాచ్ ఆడతార`ని గంగూలీ స్పష్టం చేశాడు. 

Updated Date - 2021-05-06T21:17:53+05:30 IST