కరోనాపై పోరుకు బీసీసీఐ రూ.51 కోట్లు
ABN , First Publish Date - 2020-03-29T09:55:11+05:30 IST
కరోనా వైరస్పై పోరులో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కూడా భాగస్వామి అయింది. ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని అత్యవసర నిధికి ...
ముంబై: కరోనా వైరస్పై పోరులో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కూడా భాగస్వామి అయింది. ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని అత్యవసర నిధికి శనివారం బీసీసీఐ రూ.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ‘దేశం కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో కొవిడ్-19 నివారణ కోసం జరుగుతున్న పరిశోధనలకు సహాయకంగా.. బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల తరఫున పీఎం-కేర్స్ ఫండ్కు ఈ విరాళం ప్రకటిస్తున్నాం’ అని బోర్డు పేర్కొంది. ఇదే విషయాన్ని గంగూలీ కూడా ట్వీట్ చేశాడు.