Women's T20 Challenge: మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2022-05-16T22:29:28+05:30 IST

పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ఈ నెల 23-28 మధ్య జరగనున్న మహిళల టీ20 చాలెంజ్ కోసం బీసీసీఐ నేడు జట్లను

Women's T20 Challenge: మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ఈ నెల 23-28 మధ్య జరగనున్న మహిళల టీ20 చాలెంజ్ కోసం బీసీసీఐ నేడు జట్లను ప్రకటించింది. మొత్తం మూడు జట్లు.. సూపర్ నోవాస్(Supernovas), ట్రయల్‌బ్లేజర్స్(Trailblazers), వెలాసిటీ(Velocity) జట్లు పోటీ పడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఈ జట్లకు సారథ్యం వహించనున్నారు. ఈ జట్లలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాకు 12 మంది క్రికెటర్లు కూడా పాలుపంచుకోనున్నారు. 


ఆల్ ఇండియా విమెన్ సెలక్షన్ ఒక్కో దాంట్లో 16 మంది చొప్పున మూడు జట్లను ఎంపిక చేసింది. ఈ నెల 23న ట్రయల్‌బ్లేజర్స్-సూపర్ నోవాస్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. 24న సూపర్ నోవాస్-వెలాసిటీ జట్లు తలపడతాయి. 26న వెలాసిటీ-ట్రయల్‌బ్లేజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మే 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.  

Updated Date - 2022-05-16T22:29:28+05:30 IST