పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు

ABN , First Publish Date - 2021-08-08T01:46:12+05:30 IST

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు ప్రకటించింది.

పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతక విజేతలకు బీసీసీఐ నగదు బహుమతులు ప్రకటించింది. జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు ప్రకటించింది. రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఛాను, రెజ్లర్ రవికుమార్‌లకు 50 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. కాంస్య పతకాలు సాధించిన షట్లర్ పీవీ సింధు, లవ్లీనాకు పాతిక లక్షల రూపాయలు ఇవ్వనుంది. కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు కోటి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. 

Updated Date - 2021-08-08T01:46:12+05:30 IST