ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-08-08T03:15:24+05:30 IST

ఇంగ్లాండ్-భారత్‌ సిరీస్‌ వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్...

ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్-భారత్‌ సిరీస్‌ వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సెప్టెంబరు-అక్టోబర్లలో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ జరగాల్సి ఉంది. దీనికోసం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ టోర్నీను సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ నిర్వహించడం అసాధ్యంగా మరింది. దీంతో ఆ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లూ పాల్గొననున్నారు.

Updated Date - 2020-08-08T03:15:24+05:30 IST