టీ20ల్లో మళ్లీ అభిమానుల సందడి..!
ABN , First Publish Date - 2021-01-26T18:35:50+05:30 IST
వచ్చే నెల నుంచి టీమిండియా-ఇంగ్లండ్ల మధ్య జరగనున్న మ్యాచ్లకు ఎలాగైనా ప్రేక్షకులను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీ20 మ్యాచ్లకు ఫ్యాన్స్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరగనున్న..
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి టీమిండియా-ఇంగ్లండ్ల మధ్య జరగనున్న మ్యాచ్లకు ఎలాగైనా ప్రేక్షకులను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీ20 మ్యాచ్లకు ఫ్యాన్స్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్లను అభిమానులు లేకుండానే నిర్వహించనున్నట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మిగిలిన రెండు టెస్టులను ఎక్కడ నిర్వహించేదీ ఇంకా తెలియరాలేదు. అయితే టెస్టుల తరువాత నిర్వహించే టీ20 మ్యాచ్లు ఐదింటినీ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న మోతేరా స్టేడియంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లలో అభిమానులను కూడా అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కానీ ఎంతమందిని అనుమతించాలి, ఎంత శాతం సీటింగ్ ఇవ్వాలి అనే విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ అధికారి చెప్పారు.