బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST
139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఆవిర్భావ సభ వచ్చేనెల 7న ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మిరి యం శ్రీనివాసులు తెలిపారు.
ఆగస్టు 7న ఒంగోలులో యాదవ జేఏసీ రాష్ట్ర ఆవిర్భావ సభ
కన్వీనర్ మిరియం శ్రీనివాసులు
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 4: 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర ఆవిర్భావ సభ వచ్చేనెల 7న ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మిరి యం శ్రీనివాసులు తెలిపారు. స్థానిక యాదవ జేఏసీ కార్యాలయంలో సో మవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి బీసీల రాజ్యాధికారం కోసం తొలి అడుగులు వేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీ కు లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆవిర్భావ సభలో అన్ని అం శాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో సంఘ నాయులు గోపికృష్ణ, అప్పారావు, వెంకటేశ్వర్లు, త్యాగరాజు తది తరులు పాల్గొన్నారు.