ఈనెల22లోగా ఇంటర్,డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2022-05-20T21:48:41+05:30 IST

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు(malliah bhattu) సూచించారు.

ఈనెల22లోగా ఇంటర్,డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు(malliah bhattu) సూచించారు.అదేవిధంగా 6,7,8 తరగతుల్లో ప్రవేశం కోసం జూన్ 2 వ తేదీ లోగా ఆన్ లైన్ లో http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2022 - 23 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే  040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.


Updated Date - 2022-05-20T21:48:41+05:30 IST