బలహీనవర్గాలను అణచివేయడమే వైసీపీ అజెండా

ABN , First Publish Date - 2020-11-28T06:24:51+05:30 IST

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఎదగనీయకుండా అణచి ఉంచడమే వైసీపీ అంతర్గత అజెండా అని అమలాపురం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పేర్కొన్నారు.

బలహీనవర్గాలను అణచివేయడమే వైసీపీ అజెండా

టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి

కొత్తపేట, నవంబరు 27: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఎదగనీయకుండా అణచి ఉంచడమే వైసీపీ అంతర్గత అజెండా అని అమలాపురం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె కొత్తపేటలో మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాడులే ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను, ఎంతో సౌమ్యుడిగా పేరున్న నిమ్మకాయల చినరాజప్పలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం దారుణమన్నారు. బోస్‌లాంటివారికే ఇలాంటి పరిస్థితి ఉంటే అటువంటివారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తమలాంటివారి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. చంద్రశేఖరరెడ్డి చేసిన తప్పు తెలుసుకుని బోస్‌, రాజప్పలకు క్షమాపణ చెప్పాలని, వైసీపీలో ఉన్న బలహీనవర్గాల నాయకులు ఇప్పటికైనా కళ్లుతెరిచి ప్రశ్నించాలని, లేకుంటే బానిసల్లా మిగిలిపోతారన్నారు. 


Updated Date - 2020-11-28T06:24:51+05:30 IST