బీసీల చలో ఢిల్లీ విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-25T05:14:32+05:30 IST

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే బీసీల సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముద్దాడ గణేష్‌ భవానీ అన్నారు.

బీసీల చలో ఢిల్లీ విజయవంతం చేయాలి

పాలకొల్లు అర్బన్‌, జూలై 24 : దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే బీసీల సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముద్దాడ గణేష్‌ భవానీ అన్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని సంఘ నాయకుడు ముత్యాలరావు నివాసంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం డివిజన్‌ సమావేశంలో ఆయన   మాట్లాడారు. దేశంలో సగం కన్నా అధికంగా ఉన్న బీసీ కులాల గణన జరగాలన్నారు. సమావేశంలో సంఘ నాయకులు మామిడిశెట్టి మహేష్‌ బాబు, పితాని దుర్గా ప్రసాద్‌, కవురు ముత్యాలరావు, శిడగం రమణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-25T05:14:32+05:30 IST