రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం
ABN , First Publish Date - 2020-10-31T04:17:01+05:30 IST
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకరరావు అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
అనకాపల్లి రూరల్, అక్టోబరు 30: రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకరరావు అన్నారు. శుక్రవారం గౌరీ పంచాయతన ఆలయానికి వచ్చిన ఆయన బీసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ కులాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వంలో బీసీలకు కీలక పదవులు ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్లకు జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు కాంతికుమార్, గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి సన్యాసినాయుడు పాల్గొన్నారు.