బీసీ డిమాండ్లపై 26న అఖిలపక్ష సమావేశం

ABN , First Publish Date - 2020-09-24T09:05:17+05:30 IST

ఈ నెల 26న రిజర్వేషన్ల శాతం పెంపు, జనగణనలో ఓబీసీ క్లాసు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, రాష్ట్ర బీసీ జనాభా సాధికారత, రెవెన్యూ

బీసీ డిమాండ్లపై 26న అఖిలపక్ష సమావేశం

రాంనగర్‌, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26న రిజర్వేషన్ల శాతం పెంపు, జనగణనలో ఓబీసీ క్లాసు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, రాష్ట్ర బీసీ జనాభా సాధికారత, రెవెన్యూ చట్టం ద్వారా బడుగుల స్థితి తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వామపక్ష పార్టీల నాయకులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, కె.రమలను బుధవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కలిసి ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, కోలా జనార్దన్‌, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T09:05:17+05:30 IST