ఆ నలుగురు వీరే

ABN , First Publish Date - 2020-10-19T07:19:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల్లో 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు కొత్తగా ప్రకటించిన తెలుకుల, పెరిక, అగ్నికులక్షత్రియ, అయ్యారక కార్పొరేషన్లకు చైర్‌పర్సన పదవులు జిల్లాకు చెందిన వారికి దక్కాయి.

ఆ నలుగురు వీరే

  • కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం 

కాకినాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల్లో 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు కొత్తగా ప్రకటించిన తెలుకుల, పెరిక, అగ్నికులక్షత్రియ, అయ్యారక కార్పొరేషన్లకు చైర్‌పర్సన పదవులు జిల్లాకు చెందిన వారికి దక్కాయి. రాజమహేంద్రవరానికి చెందిన సంకిస భవానీప్రియ (తెలుకుల),  కాకినాడకు చెందిన బందన హరి (అగ్నికుల క్షత్రియ), సామర్లకోటకు చెందిన ఆవాల రాజేశ్వరి (అయ్యారక), కోటనందూరు మండలానికి చెందిన పురుషోత్తం గంగాభవాని (పెరిక)లను చైర్‌పర్సన్లుగా నియమిస్తూ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి గత నెల 30నే వీరిని ఖరారు చేశారు. వైసీపీలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కాకినాడకు చెందిన బందన హరిని అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది. సామర్లకోటకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత ఆవాల లక్ష్మీనారాయణ సేవలను గుర్తిస్తూ ఆయన భార్య రాజేశ్వరికి అయ్యారక కార్పొరేషన చైర్‌పర్సన పదవి కట్టబెట్టారు. త్వరలో వీరంతా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

Updated Date - 2020-10-19T07:19:48+05:30 IST