Bc comissiosn కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-06-02T22:32:42+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అప్రతిహాతంగా, అనతికాలంలోనే అభివృద్ధిని సాధిస్తుండటం గొప్ప అనుభూతి కల్గిస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు(vakula bharanam krishna mohan rao) అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో గడుపుతున్నారని అన్నారు,

Bc comissiosn కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అప్రతిహాతంగా, అనతికాలంలోనే అభివృద్ధిని సాధిస్తుండటం గొప్ప అనుభూతి కల్గిస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు(vakula bharanam krishna mohan rao) అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో గడుపుతున్నారని అన్నారు, దేశానికి తెలంగాణ అభివృద్ధిలో దిక్సూచిగా నిలబడటం అపూర్వ చారిత్రక ఘట్టం అని అని పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయ(telangana bc comission) ప్రాంగణంలో ‘‘8వ’’ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌ డా॥ వకుళాభరణం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సభ్యులు సి.హెచ్‌. ఉపేంద్ర, కె.కిషోర్‌గౌడ్‌లు, కార్యాలయ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలు సమర్పించారు.

Updated Date - 2022-06-02T22:32:42+05:30 IST