వైసీపీకి బీసీ సెల్ అధ్యక్షుడు రాజీనామా

ABN , First Publish Date - 2021-11-30T23:47:47+05:30 IST

జిల్లాలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ

వైసీపీకి బీసీ సెల్ అధ్యక్షుడు రాజీనామా

కృష్ణా: జిల్లాలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకి బీసీ సెల్ అధ్యక్షుడు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే వసంతకు జానబోయిన శ్రీనివాసరావు లేఖ రాశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో శ్రీనివాసరావు ఉన్నారు. జోగి రమేష్ శిష్యుడిగా, పామర్తి వర్గంగా శ్రీనివాసరావుకు పార్టీలో గుర్తింపు ఉంది. మైలవరం జడ్పీటీసీ స్థానాన్ని ఆయన ఆశించారు. అయితే వేరే వారికి ఎమ్మెల్యే ఆ స్థానాన్ని ఇవ్వడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 




Updated Date - 2021-11-30T23:47:47+05:30 IST