వ్యవయసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T05:50:39+05:30 IST

రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం ర్యాలీ నిర్వహించారు.

వ్యవయసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

 ఏపీ బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ


గుంటూరు, డిసెంబరు 5: రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం ర్యాలీ నిర్వహించారు. ట్రావెలర్స్‌ బంగ్లా సెంటర్‌లో మహాత్మాజ్యోతిరావు పూలే  విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు మీడియాతో మాట్లాడుతూ రైతులను విస్మరిస్తే ఎటువంటి ప్రభుత్వాలైనా కూలిపోతాయని అన్నారు. సంఘం యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌  ఆనంద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2020-12-06T05:50:39+05:30 IST