రహదారులపై గుంతలన్నీ పూడ్చేస్తాం

ABN , First Publish Date - 2022-05-07T17:33:33+05:30 IST

వర్షాకాలం ప్రారంభం కాకముందే నగర వ్యాప్తంగా రహదారులపై ఉన్న గుంతలన్నింటినీ పూడ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని బీబీఎంపీ నూతన చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాధ్‌ పేర్కొన్నా

రహదారులపై గుంతలన్నీ పూడ్చేస్తాం

 - బీబీఎంపీ నూతన చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌

- గుప్తా నుంచి బాధ్యతల స్వీకారం


బెంగళూరు: వర్షాకాలం ప్రారంభం కాకముందే నగర వ్యాప్తంగా రహదారులపై ఉన్న గుంతలన్నింటినీ పూడ్చేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని బీబీఎంపీ నూతన చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాధ్‌ పేర్కొన్నారు. నగరంలోని కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన గౌరవ్‌గుప్తా నుంచి పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ఉత్తమ మౌలిక సదుపాయాలను కల్పించే దిశలో నగర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతామన్నారు. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి నమ్మమెట్రో రైలు పనులను పూర్తిచేయాని సంబంధిత శాఖకు సూచన చేశామన్నారు. బీబీఎంపీలో ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ఆలకిస్తానని చెప్పారు.

Read more