ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం: భట్టి
ABN , First Publish Date - 2022-03-10T21:04:45+05:30 IST
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పంజాబ్లో కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతోందన్నారు. పంజాబ్లో అమరేందర్ ముఖ్యమంత్రిగా విఫలమయ్యారన్నారు. ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్పై పడిందన్నారు. ఆ ఫలితాలు తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపవన్నారు. ఇక్కడ నాయకుల మధ్య ఎలాంటి గొడవలు లేవని, కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.