‘టీఆర్ఎస్ సర్కారులో బతుకమ్మకు మరింత ప్రాధాన్యం’
ABN , First Publish Date - 2022-10-04T06:11:19+05:30 IST
టీఆర్ఎస్ సర్కారు హయాంలో బతుకమ్మ వేడుకలకు మరింత ప్రాధాన్యత లభి స్తుందని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ అన్నారు.
జగిత్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): టీఆర్ఎస్ సర్కారు హయాంలో బతుకమ్మ వేడుకలకు మరింత ప్రాధాన్యత లభి స్తుందని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ అన్నారు. పట్ట ణంలో జిల్లా పరిషత్ ఆద్వర్యంలో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సతీమణి రాధిక, ఎమ్మెల్సీ రమణ సతీమణి సంద్య, పలువురు జడ్పీటీసీ సభ్యులు, మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకురాళ్లు పాల్గొన్నారు.